Friday, April 18, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

భక్తిశ్రద్ధలతో వీరశైవుల వనభోజనాలు

సామూహిక కార్యక్రమాల వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడమే కాకుండా, మనలో ఐక్యతను పెంపొందించవచ్చని మఠం మహంతయ్య స్వామి అన్నారు. ఆదివారం కుషాయిగూడ వాసవి కన్యకా పరమేశ్వరి శివాలయంలో వీరశైవుల కార్తీక మాస వనభోజన సమారాధన భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా మీర్పేట్ హెచ్ బి కాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ తోపాటు మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, గోల్లూరి అంజయ్య, కాసం మైపాల్ రెడ్డి, బండారి నీలం రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆగమ సలహా మండలి సభ్యులు (వీరశైవ ఆగమము)మఠం మాంతయ్య స్వామి వారి ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. శివాభిషేకం, అతిధి సత్కారం, ప్రవచనం, వనభోజన కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజ అధ్యక్షుడు బండే గౌడ, సమాజ సభ్యులు బాల్రాజ్, యావపురం విశ్వనాథం, గంగా ఈశ్వరయ్య, జ్ఞానేశ్వర్, రవి, సిద్దేశ్వర్ భీమ్ శంకర్, శంభు లింగం, కత్తి శివానంద్, మాన్కరి శివ, మఠం శివా, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!