గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో మార్చి 17 నుండి 21 వ తేదీల మధ్య జరిగిన ఆలిండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2023-2024 పోటీలలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం ఏసిపి అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న పి. కాసిరెడ్డి మెన్స్ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి కాంస్య పతకం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని, అందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని కమిషనర్ తెలిపారు