
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలంతా గత పదేళ్ల క్రితం ఓటెయ్యడానికి వెళ్ళినప్పుడు అనేక సమస్యలతో వెళ్లారు అప్పుడు తాగునీరు, రోడ్లు, మౌలిక వసతులు లేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఓటెయ్యడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. గత 70 ఏళ్ల సమస్యలను, ఇప్పుడు తీరిన సమస్యలను ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు అప్పటి వలస జీవితాలను, దుర్భర బతుకులను మననం చేసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత పరిస్థితిలను ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణను ఆగం కాకుండా చూసుకోవాలని రాత్రి నుంచి జనం ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్, బిజెపి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ఆగమవుతుందని భయపడుతున్నారు ఎవరి పక్షాన నిలబడితే రాష్ట్రం బాగుంటుందనేది ప్రజలు నిర్ణయించుకున్నారు పదేళ్లలో ఎంతో సాధించాం. ఇంకా సాధించాల్సి ఉంది ఆపదలో అందరికీ అండగా ఉన్నాం. మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తాం 10వేల మందికి ఉద్యోగాలను అందించే లిథియం అయాన్ గిగా పరిశ్రమ లాంటివి మరెన్నో తీసుకువస్తాం గత ఎన్నికల కంటే ఈసారి మాకు మరింత మెజారిటీ వస్తుందని భావిస్తున్నాం ప్రశాంతమైన మహబూబ్ నగర్ చేయడమే మా ధ్యేయం