Sunday, April 20, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

కుత్బుల్లాపూర్ లో BRS లోకి భారీ వలసలు

తెలంగాణ ఆడబిడ్డల కాళ్ల వద్దకు మంచి నీటిని తీసుకొచ్చిన అపర భగీరాధుడు సీఎం కేసీఆర్

బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కోట్ల రూపాయల నిధులతో రాజీవ్ గృహకల్పలో మౌళిక వసతులను కల్పించాం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

ఈరోజు 130- సుభాష్ నగర్ డివిజన్ పరిధి రాజీవ్ గృహకల్పలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అశోక్ – భాస్కర్ & అర్జున్ల ఆధ్వర్యంలో బిజెపి పార్టీ నుంచి 100 మంది, కాంగ్రెస్ పార్టీ నుండి 200 మంది ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి వివేకానంద మాట్లాడుతూ నాడు మంచినీటి కోసం విలవిలలాడిన రాజీవ్ గృహకల్పలో 3.41 కోట్లతో ఇంటింటికి మంచినీటి పైప్లైన్ ద్వారా నీటిని అందించిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. కాబట్టి అభివృద్దే సంక్షేమంగా ముందుకు సాగే బిఆర్ఎస్ పార్టీకి మరో మారు భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఓటర్లను కోరారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : సునీత, పరమేశ్వరి, కేజీయా, భగయా, శైలజ, లక్ష్మి, జగదాంబ, దేవి, సత్య, రామ, చంద్రకళ, భారతి, మణమ్మ, విజయ, సత్యవాణి, స్నేహ, పద్మ, భాగ్య, ఆనంద్, కుమారి, జగదీష్, నరసింహ, పంత్, లోకేష్, నాగ, మేనక, సమిత, దివ్య, గౌతమి లు…

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నే రాజు, డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, సీనియర్ నాయకులు వారాల వినోద్, కుత్బుల్లాపూర్ మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు ఎం.ఎస్
వాసు, అనిత ప్రసాద్, గుబ్బల లక్ష్మీనారాయణ, పందిరి యాదగిరి, శ్రీధర్, రాజలింగం, రాధాకృష్ణ, నారాయణ, తారా సింగ్, శివ గౌడ్, ప్రభాకర్, శ్రీనివాస్, కైసర్ పాష, కుమార్, బాలస్వామి, దేవి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!