బుధవారం, స్ఫూర్తి లీనస్ క్లబ్ అధ్యక్షురాలు ధీరజ్ రాణి ఆధ్వర్యంలో కాప్రా చెరువులో సందర్శకుల కోసం సిమెంట్ బెంచ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి క్లబ్ జిల్లా ఉపాధ్యక్షురాలు సుధాలత ముఖ్య అతిథిగా హాజరై బెంచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సమాజ హితం కోసం విశిష్ట సేవలు అందించిన పలువురు సీనియర్ సిటిజన్లను క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి లీనస్ క్లబ్ సభ్యులు సందర్శకులు సీనియర్ సిటిజన్లు తధితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కాప్రా చెరువు మరింత అందంగా, ఆహ్లాదకరంగా మారడంతో పాటు సందర్శకులకు సౌకర్యం కూడా పెరిగిందని స్థానికులు అభినందించారు.