Thursday, April 17, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

కళతప్పిన కులవృత్తులకు జీవం పోసిన సీఎం కేసీఆర్ : శంబిపూర్ రాజు, కేపీ వివేకానంద

తెలంగాణ యువతకు ఉపాధి, నైపుణ్యాలను పెంచేందుకు బీసీ బంధు వంటి సంక్షేమ పథకాలతో కళ తప్పిన కులవృత్తులకు జీవం పోసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. శనివారం కొంపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 129 – డివిజన్ కార్పొరేటర్, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ నిరుపేదలు ఎక్కువగా ఉండే సూరారం డివిజన్లో ప్రతి ఇంటికి సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబల్ బెడ్ రూమ్ కేటాయింపు, బీసీ బందు వంటి సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదంటే అది అతిశయోక్తి కాదని, నాయకులు అంతా కలిసికట్టుగా ఉంటూ మనం చేపట్టిన అభివృద్ధిని దర్జాగా ప్రతి ఒక్క ఓటరుకు తెలియజేసి రానున్న ఎన్నికల్లో విజయడంక మోగించవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!