
రాచకొండ కమిషనర్ డి ఎస్ చౌహాన్ ఐపిఎస్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ పొట్రు తో కలిసి ఈ రోజు రాచకొండ పరిధిలోని కీసర హోలీ మేరీ కళాశాల లో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఆదివారం జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఏ చిన్న సమస్య రాకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. అక్కడున్న పోలీస్ సిబ్బందికి, సెంట్రల్ బలగాలకు పలు భద్రతా పరమైన సూచనలు చేశారు.